రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన చంద్రబాబు...!!

Edari Rama Krishna
వర్షాకాలం విడిది కోసం నిన్న హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ తో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన కలుసుకున్నారు. కాగా రాష్ట్రపతి 10 రోజుల విడిది కోసం వచ్చిన సంగతి విధితమే. అయితే చంద్రబాబు భేటిలో  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించినట్లు సమాచారం. అంతే కాదు ఇరు రాష్ట్రాల్లో   తాజా పరిణామాలు, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ


కాగా రాష్ట్రపతి రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌ ఆయనకు స్వాగతం పలకనున్నారు. నిన్న వచ్చిన రాష్ట్రపతిని గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయను ఆహ్వానించడానికి వెళ్లారు. చంద్రబాబు మటుకు  ఆహ్వానించేందుకు చంద్రబాబు వెళ్లలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: