ల్యాప్ టాప్ లు, లోకేష్ బాబు.. టీడీపీని రక్షించలేదా !
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్య రాజు
టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్య రాజును గెలిపించాలని తెలుగుదేశం అధినేత తనయుడు నారా లోకేష్ బాబు స్వయంగా బరిలోకి దిగాడు. ఈ మేరకు ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాడు. చైతన్య రాజు గెలుపుకోసం అందరూ కష్టపడాలని ఆయన పిలుపునిచ్చాడు. అయితే అది వృథా పోయింది. నారా లోకేష్ బాబు వంటి నేత బరిలోకి దిగినా.. చైతన్య రాజు గెలవలేకపోవడం నిజంగా తెలుగుదేశం పార్టీ కి అవమానమే!
టీడీపీ విజయం కోసం
అంతేనా.. క్షేత్రస్థాయిలో విచారిస్తే టీడీపీ విజయం కోసం చాలా కష్టపడ్డట్టే తెలుస్తోంది. టీచర్లను సామాజికవర్గం పరంగా.. ఆకట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా భారీ గా ఖర్చు కూడా పెట్టినట్టుగా ఆరోపణలున్నాయి. ల్యాప్ టాప్ లు, వెండి పళ్లేలు.. డబ్బు పంపకాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది! మరి ఇవన్నీ కూడా యూటీఎఫ్ అభ్యర్థిని ఓడించడానికి పనికిరానట్టున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికలు టీడీపీకి ఒకింత డేంజర్ బెల్స్ లాగానే ఉన్నాయి.