బాబును ఆ హాట్ యాంకర్ ఎందుకు కలిసింది..?!

Padmaja Reddy
అనసూయ... టీవీ యాంకర్ గా ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీలో కెరీర్ ను మొదలు పెట్టి దూసుకుపోయిన అనసూయకు ఇప్పుడు స్టేట్ లెవల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొంది. ఈ విధమైన ప్రత్యేక బలగం ఉన్న అనసూయ ఇప్పుడు చంద్రబాబుతో సమావేశం కావడం ఆసక్తిని రేపుతోంది! సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బాబును అనేక మంది కలుస్తున్నారు. వారిలో అనసూయ కూడా ఒకరు. మరి పాలిటిక్స్ కు ఏ మాత్రం సంబంధం లేని అనసూయ బాబును కలవడం మాత్రం ఆసక్తికరమైన అంశమే. మరి అనసూయ బాబుకు విషెష్ చెప్పడానికే వెళ్లిందట. అంతకు మించిన వాళ్ల మధ్య మరే అంశాలూ చర్చకు రాలేదని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇక చంద్రబాబును అనసూయలాంటి గ్లామర్ డాల్ కలిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుత్తా జ్వాలా కలిసింది. ఈ స్పోర్ట్స్ స్టార్ కేసీఆర్ తో సమావేశమై విషెష్ చెప్పివచ్చింది. ఆ మధ్య నితిన్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేసి ప్లేయర్ గా ఫేమ్ ను పూర్తిగా కోల్పోయిన జ్వాల హైదరాబాద్ లో ఒక షటిల్ అకాడమీ పెట్టుకొనే ఉద్దేశంతో ఉందట. అందుకే కేసీఆర్ తో సమావేశమైందని టాక్!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: