ప్రపంచ వ్యాప్తంగా బ్రిటీష్ ఎయిర్లైన్స్ విమానాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాదాపు 3లక్షల మంది ప్రయాణికులపై పైలెట్ల సమ్మె ప్రభావం చూపనుంది. ఎంతమంది పైలెట్స్ విధులకు హాజరవుతారో, ఆయా పైలెట్లు ఏ విమానాన్ని నడపడానికి అర్హత కలిగి ఉంటారో అంచనా వేసే వ్యవస్థ తమ వద్ద అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంస్థ విమానాల సర్వీసులను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. దీనితో దాదాపు 100 శాతం విమానం సర్వీసులను రద్దు చేయడం తప్ప తమకు ప్రత్యామ్నాయ మార్గం లేదని అంటూ బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 27న మరోసారి ఆందోళన చేస్తామని బ్రిటీష్ ఎయిర్లైన్స్ పైలెట్లు ప్రకటించారు. జీతాల పెంపు విషయంలో యాజమాన్యంతో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు ఆశించిన మేరకు జరగక పోవడంతో బ్రిటిష్ ఎయిర్ లైన్స్ పైలెట్ అసోసియేషన్( బిఏఎల్ పిఏ సెప్టెంబర్-9,10 రెండు రోజుల పాటు (48 గంటల పాటు ) సమ్మె చేపట్టింది. బ్రిటిష్ ఎయిర్ లైన్స్ పైలెట్లు మొట్టమొదటి సరిగా సమ్మెకి దిగినట్టు అయింది. ఈ పరిణామంతో బిటీష్ ఎయిర్ వేస్ సంస్థ తమ అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సెప్టెంబర్-9 ప్రకటించింది.
ఈ నిర్ణయంతో బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన మొత్తం 4వేల మూడు వందల మంది పైలెట్లు సమ్మెలో పాల్గొన్నట్టు సమాచారం. బ్రిటీష్ ఎయిర్ వేస్ సాధారణంగా 48గంటల సమయంలో 1700 విమానాలను ఆపరేట్ చేస్తుందని, సోమవారం 850 విమానాలను రద్దు చేయడానికి సిద్ధమైందని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. దురదృష్టవశాత్తు, ఏ పైలట్లు సమ్మెలో పాల్గొంటున్నారో బిఏఎల్ పిఏ నుండి ఎటువంటి వివరాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.