కాపాడేదెవరో..? నిర్వేదంలో చంద్రబాబు..!

Chakravarthi Kalyan

తన కోడి, తన కుంపటి లేకపోతే తెల్లవారదని ఓ సామెత. అదే తరహాలో తాను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో అని కొందరు బాధపడిపోతుంటారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుది అదే తరహా కు చెందుతారు.


పాపం.. ఒక్క 40 రోజులు ఆయన అధికారంలో లేకపోతే.. ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అయిపోతోందట. అప్పుడే అన్ని వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారట. ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ ఇమేజీ పోయిందట. ఎవరైనా ఇక్కడకు రావాలంటే భయపడిపోతున్నారట.


ఇవన్నీ ఎవరో చెప్పిన విషయాలు కాదు.. స్వయంగా చంద్రబాబు వెల్లడిస్తోన్న కఠోర వాస్తవాలు.. అవును మరి ఆయన అధికారంలో ఉండగా ఇసుక విధానం బ్రహ్మాండంగా ఉండేదట. ఇప్పుడు జనం ఇసుక కోసం రోడ్డు ఎక్కుతున్నారట.


అప్పడే వైసీపీ నేతల దోపిడీ కోసం ప్రజలను కాల్చుకుతింటున్నారట. జగన్ తక్కువ సమయంలోనే అనేక తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారట. పాపం.. 40 రోజుల్లోనే చంద్రబాబుకు ఇన్ని అరాచకాలు కనిపిస్తే.. జగన్ పాలన ఐదేళ్లలో ఆయన ఇంకెంతగా బాధపడతారో కదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: