విజయసాయి ట్వీటు.. మరీ ఘాటుగా, మోటుగా లేదూ..?
ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ వైసీపీ సర్కారుపై విమర్శల దాడి పెంచారు. రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా జగన్ సర్కారుపై ట్వీట్లు చేస్తూ జోరు పెంచుతున్నారు. ఏదో ఒక ఇష్యూతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
నారా లోకేశ్ విమర్శలపై వైసీపీ నాయకులు కూడా అంతే ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేశ్ పై తీవ్రమైన విమర్శ చేస్తూ ట్వీట్ చేశారు. నారా లోకేశ్ కు విచిత్రమైన వ్యాధి ఉందంటూ సెటైర్ వేశారు.
"తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు అభిజ్ఞా పక్షపాతంతో(కాగ్నిటివ్ బయాస్) ఉంటారని సైకాలజీ చెబుతోందని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని పిలుస్తారని.. లోకేశ్కు కూడా ఇదే సమస్య ఉందని చెప్పారు.
ఈ వ్యాధి రావడానికి కారణాలను కూడా విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా వివరించారు. లోకేశ్ తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం.. ఒక్కడే సంతానం కావడం వల్ల ఆయన ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు విజయసాయి ఎద్దేవా చేశారు.