లోకేశ్ ట్వీట్ పై కోటంరెడ్డి ఫైర్..!!
సోషల్ మీడియాలో, హల్చల్
చేస్తున్న లోకేశ్ ట్వీట్ పై కోటం రెడ్డి హాట్గా స్సందించారు. ట్విట్టర్లో
తన మీద ఆడియో పోస్ట్ చేసిన విషయాన్ని కోటంరెడ్డి సీరియస్గా తీసుకున్నారు.
లోకేశ్ మంగళగిరిలో ఓడిన తరువాత ట్విట్టర్ బాబుగా మారారాని కోటంరెడ్డి ఎద్దేవా
చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
'' ఒక జర్నలిస్టు ఎన్నికల సమయంలో తన పైన ఇష్టానుసారం పోస్టింగ్లు పెడితే తాను మందలించానని.. ఆ మాటలకు కట్ పేస్ట్లు చేసి తన ఆడియోగా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు '' అని కోటం రెడ్డి ఆ వీడియోలో అన్నారు. అది ఎన్నికల సమయంలో జరిగిన ఘటన అని వివరించారు. ఇక, తాను అనని మాటలను సైతం అందులో చొప్పించారని ఆరోపించారు.
తన గురించి..తన కుటుంబ సభ్యుల గురించి ఇష్టానుసారం పోస్టింగ్లు పెడితే చూస్తూ కూర్చోలేమని క్లారిటీ ఇచ్చారు. తనకూ కుటుంబ సభ్యులు ఉంటారని వారి గురించి జర్నలిస్టు ముసుగులో ఇష్టానుసారం కధనాలు..వ్యాఖ్యానాలు రాస్తే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేసారు.
అసలు తాను
మాట్లాడిన వ్యక్తి జర్నిలిస్టు కాదని..ఆ ముసుగులో రాజకీయ నేతల వద్ద దళారీ అని
వివరించారు. నెల్లూరుకు చెందిన ఒక ప్రముఖ పత్రిక పేరు చెప్పకొని వారు దందా
కొనసాగిస్తున్నారని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు.