ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?

Shyam Mohan
 

ఢిల్లీలో అమిత్‌ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భేటీ ఇపుడే ముగిసింది. '' ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం , విభజన చట్టంలోని అంశాలను అమిత్‌ షాకు వివరించాం. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరాం.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలుపుతూ ఓ లేఖను అమిత్‌షాకు అందజేశాం '' అని జగన్‌ మీడియాతో అన్నారు. శనివారం జరిగే నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతానని సీఎం స్పష్టంచేశారు. దేవుడి దయతో హోదా వచ్చేవరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని, విభజన హామీలు త్వరగా పరిష్కరించాలని కోరినట్టు జగన్‌ చెప్పారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: