అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. ఐటీ, ఐటీయేతర నిపుణులకు మేలు చేసే కీలక నిర్ణయం అమెరికా ప్రభుత్వం తీసుకోబోతోంది. యూఎస్లో ఉంటున్న వారి కుటుంబీకులకు ప్రాధాన్యమిచ్చే బదులు, ప్రతిభ ఆధారంగా ఇమిగ్రేషన్ విధానాన్ని మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానంపై త్వరలో వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేయనుంది.
నూతన పాలసీ ప్రకారం, అమెరికా సాంకేతిక అవసరాలను తీర్చే వారికే గ్రీన్కార్డుల జారీలో ప్రాధాన్యం ఇస్తారు. అంటే ఎవరికి మెరిట్, టాలెంట్ ఉంటే వారికే గ్రీన్ కార్డు. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఉంటూ విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60 శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12 శాతం గ్రీన్కార్డులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త విధానంలో 100 శాతం గ్రీన్ కార్డులు టాలెంట్ ఆధారంగానే ఇవ్వాలని నిర్ణయించారు. అదే జరిగితే భారత్ నుంచి అమెరికాకు వెళ్లేవారు, అక్కడ హెచ్1బీ వీసాలపై ఉన్నవారికి యమ స్పీడుగా గ్రీన్కార్డులు వస్తాయి.