నాపై పోటీ చెయ్ జగన్‌.. లక్ష మెజారిటీతో గెలుస్తా.. అసలు కారణం ఇదే..?

Chakravarthi Kalyan
వైఎస్ జగన్ కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ కు సవాల్ చేశారు. జగన్ వచ్చి భీమిలిలో పోటీ చేయాలన్నదే ఆ సవాల్. జగన్ ఇక్కడ పోటీచేస్తే తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఆయన అన్నారు. భీమిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.



తమ పార్టీ కార్యకర్త ఒక్కరిని కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కదిలించలేకపోయిందని గంటా ధీమాగా చెబుతున్నారు. కార్యకర్తల అంతర్గత సమస్యల పరిష్కారానికి కోర్‌కమిటీని ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు. ఇటీవల గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారుతారని ఆరోపణలు వచ్చాయి.



గంటాను పార్టీ మారుతున్నారా అని మీడియా వాళ్లు అడగటం చాలా కామన్ అయిపోయింది. దీంతో విసుగుచెందిన గంటా.. ఇక మీరు ఆ ప్రశ్న అడగొద్దు అని మీడియా ముఖం మీదే చెప్పేశారు. ఎన్నిసార్లు ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పాలని విసుక్కున్నారు కూడా.



పాపం.. తాను ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా మీడియా అదే ప్రశ్న అడుగుతుండే సరికి గంటా ఈ కొత్త ఎత్తు వేసినట్టున్నారు. ఈ రేంజ్ లో జగన్ కు సవాల్ విసిరితే ఇక తన చిత్తశుధ్ధిని ఎవరూ శంకించరని గంటా భావిస్తున్నట్టున్నారు. ఏదేమైనా గంటా సవాల్ ను మరి జగన్ స్వీకరిస్తారా.. అలా చేస్తే ఇంట్రస్టింగానే ఉంటుంది భీమిలి పోరు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: