రాజకీయ రాజధాని బెజవాడలోని పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో టికెట్ చిచ్చు ప్రారంభమైంది. ముఖ్యంగా ఇక్కడ నేత ల మధ్య సమన్వయం లేని కారణంగా ఇక్కడి రాజకీయాలు కూడా దారుణంగా తయారయ్యాయి. కొన్ని దశాబ్దాలుగా ఇక్క డ టీడీపీని నమ్ముకుని నాగుల్ మీరా రాజకీయాలు చేస్తున్నారు. అయితే, ఇక్కడ పార్టీని గెలిపించుకోవడంలోఆయన తడ బడుతున్నా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మాత్రం ఆయన పార్టీలోనే ఉంటున్నారు. రెండు పోటీ చేసి ఓడిపోయినా.. వైఎస్ హయాంలో పార్టీని అన్నీతానై బతికించుకున్నా.. మీరా సేవలు గుర్తించకుండా ఉండలేం. అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ టికెట్పై విజయం సాధించిన జలీల్ ఖాన్ను చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకున్నారు.
అయితే, అప్పట్లో ఈయన చేరికను నాగుల్ మీరా వ్యతిరేకించకపోయినా.. సమన్వయం లేకపోవడంతో జలీల్కు జై కొట్టే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నే వచ్చే ఎన్నికలకు సంబంధించిన టికెట్ను నాగుల్ మీరా మరోసారి ఆశిస్తున్నారు. అయితే, జలీల్ మాత్రం వచ్చే ఎన్నికల్లోఈ టికెట్ను తన కుమార్తె షాబాన్కు ఇప్పించుకునేం దుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, దీనినే నాగుల్ మీరా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలావుంటే, ఇటీవల చంద్రబాబు చెంతకు తన కుమార్తెను తీసుకు వెళ్లిన జలీల్.. ఇంకేముంది టికెట్ కన్ఫర్మ్ చేశారంటూ.. పెద్ద ఎత్తున క్లెయిమ్ చేసుకున్నారు. దీంతో ఇది వివాదంగా మారిపోయింది.
నేరుగా రంగంలోకి వచ్చిన నాగుల్ మీరా.. చంద్రబాబు అసలు ఆ ప్రకటన చేయలేదని చెప్పారు. పార్టీకి అండగా తాము న్నామని, తమను సంప్రదించకుండా చంద్రబాబు ఎలా టికెట్ ప్రకటిస్తారని నాగుల్ మీరా ప్రశ్నించారు. దీంతో జలీల్ ఖ్యాలపై మబ్బులు ముసురుకున్నాయి. వచ్చే ఎన్నికలలో తనకు పోటీ చేయాలని ఉన్న విషయాన్ని మీరా బహిరం గంగానే చెబుతున్నారు.
అయితే, అదేసమయంలో జలీల్ కుమార్తెను ఆయన వ్యతిరేకించకపోయినా.. వారి ఆధిపత్యం పెరుగుతుందని, ఫలితంగా టీడీపీకి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని మీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు పార్టీలను మారిన సందర్భంలో జలీల్ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారని, ఈ క్రమంలో ఈయన కుటుంబానికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని మీరా అనుచరుల మాట. మొత్తానికి ఈ నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మరి బాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.