వంగవీటి రాధా కు ఆహ్వానం పంపిన కెఏ పాల్..!

KSK
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ రాజకీయాలు ఒకసారి గమనిస్తే వైసీపీ పార్టీ కి చెందిన వంగవీటి రాధా ఇటీవల విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో తనకు టికెట్ రాలేదని వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చేసి ఇతర పార్టీల వైపు..ముఖ్యంగా టిడిపి వైపు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ హైదరాబాద్‌లో జరిగిన మీడియాలో సమావేశంలో మాట్లాడుతు వైఎస్‌ఆర్‌సిపికి రాజీనామా చేసి టిడిపిలోకి చేరేందుకు సిద్దమవుతున్న వంగవీటి రాధాకును ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు.


టీడీపీకి అమ్ముడుపోయి తప్పు చేయవద్దన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక  ఇచ్చిన హామీని నెరవేర్చడంలో తాను విఫలమైతే వంద కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.


ఈ మొత్తం డబ్బును వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానన్నారు. తన తండ్రిని టిడిపి యే చంపించిందని ఆరోపణలున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరితే రాధాకృష్ణను కాపులు ఎన్నటికీ క్షమించబోరన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: