జాతీయ స్థాయిలో మరో సర్వే : ఈ సారి జగన్ ప్రభంజనమే అంటా ..!

Prathap Kaluva

2019 లో ఎన్నికలు రానున్నడంతో ఇప్పటికే పలు జాతీయ సర్వేలు ఫలితాలను వెలువరించాయి. అయితే ఇప్పుడు మరో జాతీయ సర్వే వైసీపీ దే విజయమని క్లీన్ స్వీప్ చేస్తుందని చెబుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... టీడీపీకి ఎన్ని లోక్ సభ సీట్లు వస్తాయి అన్న విషయం చూస్తే... ఆశ్చర్యం వేయక మానదు. మొత్తం 25 చోట్ల టీడీపీ పోటీ చేసినా... ఆ పార్టీకి కేవలం నాలుగంటే నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయట.


అదే సమయంలో గడచిన ఎన్నికల్లో సింగిల్గానే బరిలోకి దిగడంతో పాటు అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయలేనంటూ కుండబద్దలు కొట్టిన విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీకి ఈ దఫా ఏకంగా 19 లోక్ సభ సీట్లు దక్కుతాయట. గడచిన ఎన్నికల్లో ఏపీలో 8 సీట్లు తెలంగాణలో ఓ సీటు సాధించిన వైసీపీకి ఈ దఫా ఒక్క ఏపీలోనే ఏకంగా 19 సీట్లు దక్కనున్నాయని సదరు సర్వే తేల్చేసింది.


ఇక మిగిలిన రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎగురవేసుకుపోతుందట. ఎన్నికల్లో  ఏ ఒక్కరూ ఊహించనంత మేర సత్తా చాటుతామని బీరాలు పలుకుతున్న జనసేనకు అసలు లోక్ సభ సీట్లలో కౌంటే దక్కదట. మొత్తంగా ఈ సర్వే చూస్తే... జగన్ వైరి వర్గాలన్నీ ఉడికిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. అయినా ఈ సర్వే చేసిందెవరన్న విషయానికి వస్తే... టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ ఈ సర్వే చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: