చంద్రబాబుకు మెంటల్ అని తేల్చేశారా ?

Vijaya

మొత్తానికి చంద్రబాబునాయుడుకు మెంటల్ అని కెసియార్ తేల్చేశారు. మహూబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ చంద్రబాబువి అన్నీ మెంటల్ మాటలే అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ప్రతీదీ తానే కట్టానని, ప్రతిదీ ప్రపంచంలో నెంబర్ 1 స్దానంలో ఉంచుతానని చెప్పుకోవటం ఒక్క మెంటల్ వాళ్ళకు మాత్రమే సాధ్యమన్నారు. హౌదరాబాద్ ను తానే కట్టినట్లు, హైదరాబాద్ ను ప్రపంచ పఠంలో పెట్టినట్లు చెప్పుకోవటం ఆ కోవలోకే వస్తుందంటూ ఎద్దేవా చేశారు.

 

నిజంగానే హైదరాబాద్ ను చంద్రబాబు కడితే మరి కులీ కుతుబ్ షా ఏమి కట్టాడంటూ కెసియార్ ప్రశ్నించారు. కెసియార్ ప్రశ్నలో వాస్తవం ఉన్నట్లే ఉంది. మరి సమాధానం చెబుతారో లేదో తెలీదు. చంద్రబాబు మాటలు వింటే కులీ కుతుబ్ షా ఆత్మహత్య  చేసుకుంటాడంటూ చెప్పటం గమనార్హం. 400 ఏళ్ళ క్రిందటే కుతుబ్ షా హైదరబాద్ ను కట్టినపుడు చంద్రబాబు పుట్టాడా అంటూ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు మాట్లాడుతూ అడవులను పెంచాలని, మేకలను బ్యాన్ చేయాలన్నారు. మరి మేకలు ఎప్పుడు పుట్టాయో చంద్రబాబుకు తెలుసా ? అంటూ ప్రశ్నించారు. అందుకే తాను చంద్రబాబు మెంటల్ కేసంటున్నట్లు వివరణ కూడా ఇచ్చుకున్నారు లేండి.

 

ప్రపంచపఠంలో హైదరాబాద్ ను నిలబెట్టిన సిపాయి మరి అమరావతిలో ఒక్క ఇటుకన్నా వేశాడా ? ఒక్క శాస్వత నిర్మాణమన్నా చేశాడా అంటూ గాలి తీసేశాడు. చంద్రబాబు మాట్లాడే మాటలన్నీ కేవలం మెంటల్ వాళ్ళ మాటలేనంటూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. తెలంగాణా ఎన్నికల్లో  చంద్రబాబు పోటీలోకి దించిన 13 మందిని ఓడగొడతామన్నారు. వారికెవరికీ కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేస్తామంటూ కెసియార్ శపథం చేశారు. మరి, కెసియార్ మాటలపైన, చేసిన శపథంపైన స్పందించే ధైర్యం చంద్రబాబుకుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: