చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటే అని సంచలన కామెంట్స్ చేసిన పుష్పశ్రీవాణి..!

KSK
విజయనగరం జిల్లాలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర కి విజయనగరం ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ ఎక్కడ అడిగి పెట్టిన సామాన్య ప్రజలు తమ కష్టాలను చెప్పుకుంటూ రాబోయే ఎన్నికలలో జగన్ ని  ముఖ్యమంత్రి చేసుకుంటామని..మా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసేది ఒకే ఒక్కడు జగన్ అని ప్రజలు బలంగా తెలియజేస్తున్నారు.


ఈ క్రమంలో విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆ ప్రాంతంలో జరిగిన మహాసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి బహిరంగ సభలో సంచలన కామెంట్ చేశారు. తాను జీవితాంతం వైసీపీలోనే ఉంటానని, జగనన్న వెంట నడుస్తానని తెలిపారు.


కురుపాం గడ్డ వైఎస్సార్‌ కుటుంబానికి అడ్డా అని స్పష్టం చేశారు. వైఎస్ ఆర్ అభిమానులు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. కట్టె కాలే వరకు వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటామని అంటుంటారు అది నిజమన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ చాలాసార్లు తనను ప్రలోభాలకు గురిచేసిందని అయితే జగన్ నాయకత్వంలో పని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని..


ఎక్కడా కూడా రాజీ పడకుండా జగన్ వారి బాటలో నడవటం జరిగిందని తన జీవిత చివరి రక్తపు పోటు వరకు జగన్ వెంటే రాజకీయాల్లో నడుస్తానని ప్రజలను ఉద్దేశించి గర్వంగా చెప్పారు పుష్పశ్రీవాణి. రాబోయే ఎన్నికలలో కురుపాం ప్రజలు, కార్యకర్తలు, జిల్లా పెద్దల ఆశీస్సులు, జగన్‌ ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయని పుష్పశ్రీవాణి తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: