జగన్ నిందితుడు శ్రీనివాస్ మర్డర్..?

KSK
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం లో దాడికి పాల్పడిన శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మీడియా చానల్స్ లో మరియు అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలులో ఈ పేరు నానుతుంది. జగన్ పై దాడి జరగడంతో సిట్ అధికారులు గత రెండు రోజులు నుంచి నిందితుడు శ్రీనివాస్ ని విచారిస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే.


ఈ క్రమంలో తాజాగా నిందితుడు శ్రీనివాస్ అస్వస్తతకు గురయ్యాడని విశాఖ పోలీసులు అతని కేజీహెచ్ కి తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో గతంలో జగన్ పై దాడి చేసినప్పుడు బలంగా ఉన్న శ్రీనివాస్..ఆస్పత్రికి పోలీసులు భుజాలపై వేసుకుని వెళ్లడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకనికి.


ఇదే క్రమంలో నిందితుడు శ్రీనివాస్ పోలీసులు జీపులో కూర్చుని నాకు ప్రాణహాని ఉందంటూ లబోదిబో మంటున్నాడు..మరియు అదే విధంగా ప్రజల తో మాట్లాడే అవకాశం కల్పించాలని వేడుకొంటున్నా వీడియో సోషల్ మీడియాలో రావడంతో..జగన్ పై జరిగిన హత్య యత్నం పై అసలు విషయాలు బయటపడతాయని కొంతమంది దుండగులు శ్రీనివాస్ నీ హతంచేయడానికి సరి కొత్త ప్లాన్ ప్రజెంట్ రన్ అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు.


మరోపక్క వైసీపీ నేతలు జగన్ హత్యాయత్నం కేసులో కేంద్ర బలగాలు రంగంలోకి దిగితే తమ పని అయిపోతుందేమోనని...నిజాలు బయటకు వస్తాయేమోనని చంద్రబాబు నిందితుడు శ్రీనివాస్ లేకుండా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: