షాకింగ్: ఆ విషయంలో జగన్ అన్నట్టుగానే చంద్రబాబు చేస్తున్నాడు..!

KSK
ఎన్నికలు వస్తున్న తరుణంలో తెలుగుదేశం అధినేత ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ప్రతిపక్షనేత జగన్ తన పాదయాత్రలో అన్నట్టుగానే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు నాలుగు నెలల ముందు ఎన్నికలు తరువాత ఆరు నెలలు అన్నట్టుగా ఇష్టానుసారం అయినా హామీలు ఇస్తూ చెలరేగిపోతున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి నిరుద్యోగభృతి ఇస్తానని...అంతేకాకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి రాష్ట్రంలో యువకుడికి నిరుద్యోగికి ఇవ్వలేదు.. అంతేకాకుండా ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు చంద్రబాబు.


అయితే ఎన్నికలు వస్తున్న తరుణంలో తాజాగా ఇటీవల షరతులతో కూడిన నిరుద్యోగభృతి ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు బాబు గారు. ఇదిలావుండగా ప్ర‌పంచ ఆదివాసి దినోత్స‌వం సంద‌ర్భంగా విశాఖ జిల్లా పాడేరులో రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురువారం ప‌ర్య‌టించారు. అనంత‌రం పాడేరులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సిఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ... గిరిజ‌నుల అభివృద్ధికి టిడిపి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని, గిరిజ‌నుల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌ని తాను అధికారంలోకి రాగానే బాక్సైట్‌ను ర‌ద్దు చేశాన‌ని తెలిపారు.


50 ఏళ్లు నిండిన గిరిజ‌నుల‌కు త‌ప్ప‌నిస‌రిగా పింఛ‌ను ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆదివాసీ జీవ‌న ప్ర‌మాణాల‌తో పాటు గిరిజ‌న ప్రాంతాల్లో మొబైల్ క‌నెక్ట‌విటీ పెంచుతామ‌న్నారు. ఇలా ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబు ఈ విధంగా వ్యవహరించడంతో..రాష్ట్రంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.


దేశ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల జీవన విధానాలలో మార్పు తీసుకురాకుండా తన కడుపు నింపుకోవడం కోసం చంద్రబాబు ఆడుతున్న ఈ రాజకీయ ఆటలు చూసి పైన దేవుడు కూడా క్షమించరని అంటున్నారు. కచ్చితంగా రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకి తన రాజకీయ జీవితంలో కోలుకోలేని దెబ్బ తగలబోతుందని అంటున్నారు మరికొంతమంది రాజకీయ నాయకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: