శ్రీరెడ్డి కోలీవుడ్ వ్యవహారం... విశాల్ తరువాత స్టెప్ అదేనా...!

Prathap Kaluva

శ్రీరైడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ మీద ఆరోపణలు చేసింది. ఇప్పుడు కోలీవుడ్ మీద పడింది దీనితో తమిళ్ మీడియా కూడా శ్రీరెడ్డి ఇంటర్వ్యూ ల కోసం ఎగపడుతుంది. తమిళ ఇండస్ట్రీ ప్రముఖల మీద ఆరోపణలు చేయడం ద్వారా వారు స్పందించక తప్ప లేదు. అయితే విశాల్ మీద కూడా బెదిరింపు ఆరోపణలు చేయడం తో విశాల్ ఎలా స్పందించబోతున్నాడని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. 


శ్రీరెడ్డి ఆరోపణల్ని శ్రీకాంత్, లారెన్స్ ఇప్పటికే తిప్పికొట్టగా.. ప్రెస్ మీట్ పెట్టి విషయాలు వెల్లడించేందుకు విశాల్ రెడీ అవుతున్నాడు. ఈ మేరకు కొంతమంది టాలీవుడ్ ఫ్రెండ్స్ నుంచి ఇన్ పుట్స్ కూడా తీసుకున్నాడు. రీసెంట్ గా దీనిపై కార్తి కూడా రియాక్ట్ అయ్యాడు. తన దగ్గరున్న సాక్ష్యాలతో శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చంటూ సలహా ఇచ్చాడు. విశాల్, కార్తి చర్యలపై శ్రీరెడ్డి మండిపడింది.


కార్తి మాటలు తనను ఎంతగానో బాధించాయని చెబుతున్న శ్రీరెడ్డి, తన బాధను అర్థం చేసుకోవాలని లాజిక్స్ తీయొద్దని అంటోంది. నడిగర్ సంఘం న్యాయం చేస్తుందనే నమ్మకం తనకు ఉందని ప్రకటించింది శ్రీరెడ్డి. ఓవైపు నడిగర్ సంఘంపై నమ్మకం ఉందని చెబుతూనే, మరోవైపు పెద్దలకు కొమ్ముకాసేలా సంఘం వ్యవహరించకూడదంటూ విమర్శలు కూడా చేసింది శ్రీరెడ్డి. జయలలిత బతికుంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, కంటిచూపుతో తన సమస్య పరిష్కారమయ్యేదని అంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: