పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు పంపిస్తున్న టీడీపీ ఇక చూసుకో...!

Prathap Kaluva

టీడీపీ మీద పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న సంగతీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ విమర్శలు ప్రతి పక్ష నాయకుడైన జగన్ ను కూడా మించి పోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే కూడా ఎదురు దాడి చేస్తుంది కానీ జగన్ మీద రెచ్చిపోయినట్లు చేయడం లేదు. అయితే ఎట్టకేలకు పవన్ మీద కూడా దాడి చేయాలనీ చంద్ర బాబు ఆదేశాలు జారీ చేసాడు. దీనితో ఇక టీడీపీ నేతలు రెచ్చిపోతారన్న సంగతీ వేరే చెప్పాల్సిన పని లేదు. 


ఇన్నాళ్లూ ఏదో తాము చూసీచూడనట్లు పోయాం అని బిల్డప్ ఇవ్వడానికి ఈ రకంగా మాటలు వండుతున్నట్లు ఉన్నదే తప్ప.. ఇన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు ఉపేక్షించిందేమీ లేదు. పవన్ కల్యాణ్ మీద ఎలాంటి విమర్శలు చేయగలరో అన్ని విమర్శలూ చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తూ చంద్రబాబు, లోకేష్ లు కూడా పవన్ కల్యాణ్ వెటకారం చేస్తూ వ్యాఖ్యలు చేయడం, ఆయన రిటార్టులకు బలికావడం జరుగుతూనే ఉంది.


పవన్ కల్యాణ్ కేంద్రంలోని భాజపాతో కుమ్మక్కు అయ్యాడని, కేంద్రాన్నేమీ అనకుండా.. అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఆడిపోసుకుంటున్నాడని అనేక విమర్శలు చేస్తూనే ఉన్నారు. పవన్ జేఎఫ్‌సీ గురించి కూడా విమర్శిస్తూనే ఉన్నారు. పవన్ మీద ఆయన సామాజిక వర్గానికే చెందిన మంత్రుల ద్వారా విమర్శలు చేయించడం లాంటి వ్యూహాలను కూడా తెలుగుదేశం చాలాకాలం ముందునుంచే అమల్లో పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: