త్వరలో ఆంధ్ర రాజకీయాల్లో పెనుమార్పు?

Prathap Kaluva
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, గుంటూరు జిల్లాకు చెందిన జీవీఎల్‌ నరసింహరావును  బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్‌ నుంచి  రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాష్ట్ర రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ అధికారపక్ష తీరును ఎండగడుతూ వస్తున్నారు. కాగా నేడు ఆయన రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వాఖ్యలు చేశారు.


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇంకొద్ది రోజుల్లో మారబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  కావాలంటే కొద్దిరోజులవరకు వేచి చూడండి అని ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తామే చేశామని టీడీపీ ప్రచారం చేసుకోవడం విడ్డూరమని ఆయన తెలిపారు.


కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు ఇక్కడి తెలుగువారు బాగానే కుట్ర చేస్తున్నారని, అందుకు ఉద్యోగులను సైతం  ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకులకుకానీ, కార్యకర్తలకుకానీ టీడీపీపై ఎటువంటి ద్వేషం లేదని తెలిపారు. కాకపోతే టీడీపీ నిరంకుశ విధానాలు, ఆ పార్టీ నాయకుల పై ప్రజలే కక్ష పెంచుకున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు ఇది గుర్తించాలని ఆయన చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: