ఆడాళ్ల జాబితాలో లోకేశ్.. హవ్వ రోజా ఎంత మాట అనేసింది..!?

Chakravarthi Kalyan
నారా లోకేశ్ పప్పు.. లోకేశ్ సుద్దపప్పు.. ఇలాంటి కామెడీ వైసీపీ నేత సెటైర్లు రోజా చాలాసార్లు వేశారు. ఈసారి ఇంకొక్క అడుగు ముందుకేశారు. ఏకంగా నారా లోకేశ్ ను మహిళల జాబితాలో చేర్చేశారు. బడ్జెట్ లో మహిళలకు అన్యాయం జరిగిందన్న విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఈ కామెంట్లు చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే చదువుదాం.. 


" చంద్రబాబు తన కొడుకు మంత్రి పదవి ఇచ్చి రాష్ట్రమంతా ఉద్యోగాలు ఇచ్చినట్లు సంతోషపడుతుంటాడు. మీ కేబినెట్‌లో ఇద్దరు మహిళా మంత్రులను తీసేసి అమ్ముడుపోయి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చి అదే మహిళా సాధికరత అనుకుంటే ఎలా? మహిళా కోటాలో లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం సాధికారతా? మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా రుజువైంది."


" మహిళా పరిరక్షణకు ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేసే ప్రతిపాదన పోలీస్‌ విభాగం వద్ద ఉందా అంటే హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప లేదని చెప్పారు.  ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రక్షణ కోసం ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అది చేశారా..? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి."


"ప్రపంచంలోనే మహిళల అక్రమ రవాణాలో ఏపీ 2వ స్థానంలో ఉందంటే.. మహిళల భద్రత ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్రంలో దుర్వోధన, దుశ్యాసన, దుర్మార్గపు పాలన సాగుతుంది. టీడీపీ గుండాలు, రౌడీలు ఏ విధంగా మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారో అర్థం అవుతుంది. వనజాక్షి విషయంలో ఏం న్యాయం చేశారు. ఓటుకు కోట్ల కేసులు చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే ఐఏఎస్‌ అనురాధను బదిలీ చేశారు. పెందుర్తిలో బండారు అనుచరులు ఎస్సీ మహిళలపై వివస్త్రను చేసి దాడి చేస్తేం ఏం చేశారు. ఇంత వరకు తప్పు చేసిన వారిని దండించారా..?" ఇవీ రోజా ఆరోపణలు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: