ఓటుకు నోటు...మోడీకి షాక్..!

veeru
గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. అలాంటి ఇలాంటి స్ట్రోక్ కాదు... పటేల్ పోరాట సమితి నాయకుడు హార్ధిక్ పటేల్ ఇచ్చిన దిమ్మతిరిగిపోయే పంచ్ తో బీజేపీ లాక్కోలేక పీక్కోలేక చస్తోంది. త్వరలో గుజరాత్ లో జరగబోయే ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయన్న అంచనాలున్నాయి. పాతాళానికి పడిపోయిందని చెబుతున్న కాంగ్రెస్ కమలానికి పోటీ ఇచ్చే స్థాయికి పుంజుకుంది.


ప్రధాని సొంత రాష్ట్రం కావడంతో అందరి దృష్టి గుజరాత్ పై పడింది. పరిస్థితులు తేడా కొట్టేలా ఉండటంతో బీజేపీ గెలవడానికి దొడ్డిదారులు వెతకడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే తమకు వ్యతిరేకంగా ఉన్న పటేల్ ఉద్యమనేత హార్దిక్ పటేల్  దగ్గరి అనుచరులకు వలవేసింది. అందులో ఇద్దరు కమలంతో చేరిపోయారు. ఇక మనకు తిరుగులేదు అనుకున్న సమయంలో ఆ ఇద్దరిలో ఒకరైన నరేంద్రపటేల్ బీజేపీకి ఓ ఝలక్ ఇచ్చారు.


పార్టీలో చేరేందుకు బీజేపీ తనకు కోటిరూపాయలు ఆఫర్ చేసిందని చెప్పిన అందుకు తనకు పదిలక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారన్నారు. అంతేకాదు ఆ డబ్బును కూడా మీడియా ముందు ప్రదర్శించారు. తనతో ఎవరెవరు బేరాలాడిందీ మొత్తం బయటపెట్టేశాడు. దీంతో బీజేపీ సూప్ లో పడిపోయింది. దీన్లోంచి బయటపడేందుకు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టింది. ఇదంతా కాంగ్రస్ ఎత్తుగడ అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. 


తన మనుషులతో బీజేపీ బండారాన్ని బయటపెట్టిన హార్ధిక్ పటేల్ ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు. మొత్తానికి మోడీ సొంతరాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంత పాజిటివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. అక్కడ కనుక ఏదైనా జరిగితే దేశం ముందు తలెత్తుకోలేని పరిస్థితి 
ఏర్పడుతుంది. అందుకే గెలుపుకోసం బీజేపీ నేతలు ఇలా దొడ్డిదారి తొక్కి అడ్డంగాబుక్కైపోయారు. మరి చూడాలి అమిత్ షా ఈ గండం నుంచి ఎలా 
గట్టెక్కిస్తారో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: