దావూద్ ఇబ్రహీం వల్ల నాకు ప్రాణహాని ఉంది..!

Edari Rama Krishna
భారత దేశంలో అత్యంత విషాదకరమైన సంఘటనగా చెప్పుకునేది 1993 ముంబాయి బాంబు పేలుళ్ల.  ఇంతటి దారుణానికి పాల్పపడింది..అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.  బాంబు పేలుళ్ల అనంతరం పాకిస్థాన్ పారిపోయిన  దావూద్ అక్కడి నుంచి తన నెట్ వర్క్ నడుపుతూ వచ్చాడు.  ఆ  దావూద్ ని భారత్ కి తీసుకు వస్తారని వార్తలు కూడా వచ్చాయి.  

రీసెంట్ గా బిల్డర్లు, నగల వర్తకులను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ తో సంబంధాలున్న ఇద్దరిని అరెస్టు చేశారు థానె పోలీసులు. తాజాగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనను చంపేస్తానని బెదిరిస్తూ ఫోన్ కాల్ చేశాడని  ప్రముఖ సామాజిక కార్యకర్త అంజలి దమానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ఏక్ నాథ్ ఖడ్సేపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని... లేకపోతే చావు తప్పదని బెదిరించారని ఆమె తన ఫిర్యాదు లో పేర్కొన్నారు.

దావూద్ ఇబ్రహీం నుంచి తనకు ఈ కాల్స్ వచ్చాయని ఆ ఫోన్ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిందని... నంబరు దావూద్ ఇబ్రహీం పేరిట ఉందని తెలిపారు.  తన భర్త తో చాటింగ్ చేస్తున్న సమయంలో రాత్రి 12.33 గంటలకు ఈ ఫోన్ వచ్చిందని ఆమె తెలిపారు. ట్రూకాలర్ లో ఆ నంబర్ దావూద్ ఇబ్రహీంకు చెందనదిగా చూపించిందని చెప్పారు. ట్రూకాలర్ స్క్రీన్ షాట్ ను కూడా తీసి ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.




Last nght at 12.33,I recd a threatening call asking me to withdraw all cases against Khadse +922135871719 Truecaller shows Dawood 2 Pakistan pic.twitter.com/9GUqR2VVNt

— Mrs Anjali Damania (@anjali_damania) September 23, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: