ఎన్టీఆర్ జయంతి.. చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న హరికృష్ణ..

Chakravarthi Kalyan
ఇవాళ ఎన్టీఆర్ జయంతి.. ఎప్పుడు తలుచుకున్నా తలుచుకోకపోయినా ఈరోజు మాత్రం టీడీపీ నేతలంతా పెద్దాయనను తలచుకుంటారు. బతికి ఉండగా చేసిన ద్రోహం సంగతి ఎత్తకుండా ఆ మహానుభావుడు రాముడు..దేవుడు.. అంటూ ఆకాశానికెత్తేస్తారు. పనిలో పనిగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని తీర్మానాలు కూడా చేస్తారు.. 



ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి, తన తండ్రికి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి ప్రభుత్వాల తీరును తప్పుబట్టాడు. గతంలో అన్నగారు ప్రవేశ పెట్టిన పథకాలనే కాపీ కొట్టి రూపొందించి కొనసాగిస్తున్నారని హరికృష్ణ కామెంట్ చేశారు. 



ప్రస్తుత ప్రభుత్వాలు పాత పథకాలకు కొత్త కలరింగ్ ఇస్తున్నాయన్నారు. ఆయా పథకాలను తమ సొంత పథకాలుగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వెటకారం ఆడారు నందమూరి హరికృష్ణ. పాపం ఈయన ఇష్టమున్నా లేకపోయినా తండ్రి పెట్టిన పార్టీ కాబట్టి తెలుగు దేశంలోనే కొనసాగుతున్నారు. కొంతకాలంగా సైలంట్ గా ఉంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: