క్లాస్‌మెట్స్ గ్యాంగ్ రేప్ ఆపై వీడియో..!!

Edari Rama Krishna
భారత దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. మహిళలు, యువతులు చివరకు మైనర్ల పై కూడా అత్యాచారాలు కొనసాగిస్తున్నారు కామాంధులు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. నిర్భయ చట్టం అమల్లో ఉన్నా ఈ అత్యాచారాలు మాత్రం అరికట్టలేక పోతున్నారు. తాజాగా ముంబైలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలికపై నలుగురు క్లాస్‌మెట్స్ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.  ఆ తర్వాత గ్యాంగ్ రేప్ వీడియోను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియోలో వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈనెల 8వ తేదీన పశ్చిమ ముంబై, మలాడ్‌లోని ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు స్నేహితులు పదవ తరగతి చదువుతున్నారు. వారితో పాటు మరో బాలిక కూడా కలిసి చదువుకుంటుంది. గ్రూప్ స్టడీ చేద్దాం అంటూ తమ ఇంటికి పిలిపించారు ఆ బాలికను..తర్వాత నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీశారు. ఆ తర్వాత విషయం బయటకు చెపితే హత్య చేస్తామని, వీడియోను లీక్ చేస్తామని బెదిరించారు.

వాట్సప్ దృశ్యాలను బాలిక చూసినప్పటికీ సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేదు. బాలికకు తల్లిదండ్రులు లేరు. తన ఆంటీ వద్దనే ఉంటోంది. ఆ వీడియతో బాలిక అత్తకు కూడా వచ్చింది. దీంతో బాలికను నిలదీయడంతో విషయం బయటపడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిలో నలుగురిని ఐపీసీ 376 సెక్షన్ కింద పోలీసులు అరెస్టు చేశారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: