మైనస్ ఉష్ణోగ్రతల్లో సైతం మన సైనికులు దేశ రక్షణకు ఎలా పహారా కాస్తున్నారో తెలుసుకోవాలని చాలా మందికి ఆతృత ఉంటుంది. కానీ..అవకాశం దొరకడం కష్టం. కానీ కేంద్రం ఇప్పుడు ఆ చాన్స్ ఇస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన సియాచిన్కు టూరిస్టులను అనుమతించనున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్.. సముద్ర మట్టానికి 11875 నుంచి 18875 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. గడ్డకట్టే మంచు కొండల మధ్య మన సైనికులు నిత్యం పహారా కాసే చోటు.. కఠిన శిక్షణ పొందిన జవాన్లనే ముప్పతిప్పలు పెట్టే వాతావరణానికి నెలవు సియాచిన్. మైనస్ 18 నుంచి మైనస్ 60 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రాంతంలోకి టూరిస్ట్లకు ఓకే చెప్పేశారు.