పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన కాని వ్యభిచారం మాత్రం ఆగడంలేదు.ఎంత వెదికితే అంత దొరుకుతుంది అనే చందాలా రోజు రోజుకు కేసులు ఎక్కువవుతున్నాయేకాని తగ్గడం లేదు.ఇది ఎవరి తప్పు అనే ప్రశ్న చాలా సార్లు చాలా మందికి మనసులో కలుగ వచ్చూ.కాని చట్టంలో ఎన్ని మార్పులు తెచ్చిన ఈ సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ను కనిపెట్టలేక పోతుంది.ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యభిచార నిర్వాకులు వారి దందను కొనసాగిస్తున్నారు.ఈ వ్యబిచారం చేసేవారిలో ఎక్కువగా యువతులు,మధ్య వయస్సు ఆడవాళ్లు వుంటున్నారు.ఇక తాజాగ మరో హైటెక్ వ్యభిచార మూఠా గుట్టు రట్టు చేసారు.ఈ కేసులో రెండో పట్టణ పోలీసులు.ముంబై, బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకోగా విటులు పరారైపోయారు.నిర్వాహకుడు ఎక్కడో వుంటూ ఫోన్ ద్వారానే లావాదేవీలు నడిపిస్తుండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ముంబై,బెంగళూరుకి చెందిన యువతులు ఈ నెల 20,22న విమానంలో నగరానికి చేరుకున్నారు.వారు విమానాశ్రయం నుంచి నేరుగా కారులో అల్లిపురంలోని విశాఖ ఇన్ హోటల్కు చేరుకుని అప్పటికే వారి పేరిట బుక్ చేసి వున్న గదుల్లో దిగారు .అప్పటికే అక్కడికి చేరుకున్న విటులతో కలసి హోటల్ రూం లో తమ పని కానిచ్చుకుంటున్నా రు.ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతుండటంతో వారి గదుల్లోకి కొంతమంది విటులు వెళ్లి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.దీంతో టూటౌన్ సీఐ సీహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హోటల్పై దాడి చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు.విటులు మాత్రం కొద్దిసేపటికి ముందే బయటకు వెళ్లిపోవడంతో వారు తప్పించుకున్నారు.ఈ ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారించగా హైటెక్ పద్ధతిలో వ్యభిచారం జరుగుతున్న గుట్టు విప్పారు.
తమకు రిషి అనే వ్యక్తి మాత్రమే తెలుసునని,ఆయన చెప్పినట్టు తాము చేస్తామని తెలిపారు.తాము ఎక్కడికి వెళ్లాలనేది ఫోన్లోనే చెబుతాడని,తమకు విమానం టిక్కెట్లు కూడా అతనే బుక్ చేసి మెయిల్ చేసేస్తాడని వివరించారు.ఏ నగరానికి వెళ్లినా అక్కడ హోటల్ రూమ్ నుంచి కారు వరకూ అన్నీ బుక్ చేసి తమ ఫోన్కు వాటి వివరాలు మెసేజ్ చేస్తాడని తెలిపారు.ఏ నగరానికి వెళ్లినా రెండు రోజులు మాత్రమే వుంటామని,తర్వాత రూమ్ ఖాళీ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుంటామని,డబ్బులు మాత్రం తమ ఖాతాకు జమ చేస్తాడని పట్టుబడిన యువతులు వివరించారు.పునరావాస కేంద్రానికి పట్టుబడిన యువతులను తరలించామని,రిషి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు..