లోకేష్ 'పెద్ద మనిషయ్యాక' అది ఎప్పుడు చూడలేదు : విజయసాయి రెడ్డి

guyyala Navya
వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏదోకా వివాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లోకి ఎక్కే విజయసాయి రెడ్డి ఈరోజు కూడా లోకేష్ తెలివిపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. 


నారా లోకేష్ బ్రెయిన్ మాములు బ్రెయిన్ కాదని అంటూ ఒక కామెడీ ట్విట్ చేస్తే మరోసారి పెద్దమనిషి అంటూ మరో ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్స్ వైరల్ అవుతున్నాయి. పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా. చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్‌ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది. అని ఒక ట్విట్ చేస్తే.. 


''నారా లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది.'' అంటూ ట్విట్ చేసి సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాడు. ఏది ఏమైనా లోకేష్ ట్విట్టర్ లో చేసే కామెడీ నెటిజన్లకు తేగా నచ్చేస్తుంది. 


లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది.

— Vijayasai Reddy V (@VSReddy_MP) August 17, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: