పాపల భైరవుడు ఆయనేట.....పెదబాబుకు షాకే మరి...!!

Satya
 ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటాయి. చంద్రబాబుకు ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడంలేదు.  పార్టీలో నుంచి బయటకు వెళ్లిన వారు అయితే లోకేష్ మీద బండ వేసేస్తున్నారు. నిజానికి చంద్రబాబు పాలన ఒక ఎత్తు అయితే ఆయన కొడుకు లోకేష్ ని పార్టీలోకీ తీసుకురావడం వల్ల జరిగిన భారీ రాజకీయ నష్టం మరో ఎత్తు. ఆ సంగతి పార్టీ విడిచిన నేతలు చెబుతూంటే అందరికీ అర్ధమవుతోంది.


ప్రత్యర్ధి వైసీపీ ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట సైకిలు చిత్తు అయిన కారణాలు చెబుతూనే ఉంది. మరో వైపు పార్టీలో నిన్నటి వరకూ ధైర్యం చేయలేని వారు సైతం ఇపుడు చంద్రబాబు పరోక్షంలో , ప్రత్యక్షంలో కూడా పార్టీ పతనానికి గల కారణాలను చెప్పేస్తున్నారు. మరి కొందరు స్వరాన్ని బాగా పెంచి మరీ పాపాల భైరవుడు ఎవరో విడమరచి  విప్పి చెబుతున్నారు.  లోకేష్ ఏ విధంగానూ బాబుకు సరి సాటి కాదు కదా రాజకీయాలు సూట్ కారని నూటికి తొంబయి మంది టీడీపీ నేతలో ఉంది. 


మరి ఎందుకు భరించారు అంటే నాడు పార్టీ అధికారంలో ఉంది, అందుకు అంతా నోరు మూసుకున్నారు, ఇపుడు ఎటూ పార్టీ దారుణంగా పతనమైంది. అందువల్ల నోళ్ళు తెరచుకుని గటగటా నిజాలు చెప్పేస్తున్నారు. తాజాగా పార్టీని విడిచి బీజేపీలో చేరిన అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ భాగోతాలు ఒక్కోటిగా బయటేస్తున్నారు. ఐటీ శాఖలో అవినీతికి లోకేష్ పాల్పడ్డారని, దాని మీద సీబీఐ విచారణ కోరుతామని  అంటున్నారు. లోకేష్ లాంటి అసమర్ధుడు ఉన్న పార్టీలో ఎవరూ ఉండరని కడిగిపారేస్తున్నారు.


 ఇక పార్టీలో ఉంటూ  ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తున్న విజయవాడ ఎంపీ  కేశినేని నాని గొడవ కూడా సరిగ్గా ఇదే. పార్టీలో లోకేష్ కోటరీ మూలంగా నష్టపోతున్నామని ఆయన చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీ నుంచి దూరంగా జరిగిన సుజనా చౌదరి వంటి వారు సైతం లోకేష్ కారణంగానే బాబుతో సంబంధాలు తెగి పక్కకు వెళ్ళిపోయారని అంటారు. మొత్తం మీద చూస్తే లోకేష్ వల్ల పార్టీ లో పెద్ద సంక్షోభం తలెత్తిందన్నది తమ్ముళ్ల ఏకాభిప్రాయంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: