ఏపీ సీఎం చంద్రబాబుకు ఐరన్ లెగ్ అన్న ముద్ర తెలుగు ప్రజలు వేశారు. బాబు గతంలో పదేళ్లపాటు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు రాష్ట్రం తీవ్రమైన కరువు కాటకాలతో అల్లాడింది. చంద్రబాబు పాలనలో తెలుగు గడ్డపై వర్షపు చుక్క అనేదే లేకుండా పోయింది. చెరువులు, నదులు, రిజర్వాయర్లు ఎండిపోయి. వ్యవసాయం సంక్షోభంలో పడింది. చంద్రబాబు ఎప్పుడైతే సీఎం పీఠం నుంచి దిగిపోయారో రాష్ట్రం మొత్తం పచ్చని పుడమిని సంతరించుకుంది. ఆ తర్వాత చంద్రబాబును తెలుగు ప్రజలు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత బాబును నవ్యాంధ్రకు తొలి సీఎంగా అనుభవించాడని ఎన్నుకున్న ఐదేళ్లలో బాబు ఏపీకి ఒరగబెట్టింది శూన్యం.
అందుకే ఈ ఎన్నికల్లో బాబును మళ్లీ చిత్తు చిత్తుగా ఓడించి ఆయన పొలిటికల్ కెరీర్ కు దాదాపు పులిస్టాప్ పెట్టేయనున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తానంటూ ఢిల్లీలో నానా హడావుడి చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోడీ పీఎం పీఠం ఎక్కకూడదని డిసైడ్ అయిన చంద్రబాబు కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కొత్త నాటకం ఆడాలని చూస్తున్నా.. ఆయనను ఢిల్లీలో పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. విచిత్రమేంటంటే ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందే రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబు ఐరన్ లెగ్ మహిమా అంటూ ఆయన ఫ్రెండ్స్ కు కూడా అదిరిపోయే షాక్ ఇచ్చాయి. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీకి, బిజెపి భారీ షాక్ ఇవ్వనుంది. బెంగాల్ లో బిజెపి ఏకంగా 20 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ చెబుతున్నాయి.
యూపీలో ఎస్పి, బీఎస్పి మహాగట్ బంధ్ చిత్తుచిత్తు కానుంది. కర్ణాటకలో జేడిఎస్ ఖాతా తెరవడం కూడా కష్టం కానుంది. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పొత్తు చిత్తయింది. యూపీలో రాహుల్ గెలుపు కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో బిజెపి సంచలన విజయాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. ఓవరాల్గా చూస్తే చంద్రబాబు ఎవరితో అయితే కలిసి మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నాలు చేశారో ఆ పార్టీలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఏపీలో తన కథకు శుభం కార్డు పడిందని ముందే భావించిన చంద్రబాబు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలను కలిపి... ఆ కూటమి తానే కట్టానని బిల్డప్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే హంస పాదు తగిలేలా కనిపిస్తోంది.
చంద్రబాబు ఒకటి చేయాలనుకున్న ఆయన మిత్రులందరూ ఆయన లెగ్ పుణ్యమా అని చిత్తుచిత్తుగా ఓడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే అందరికీ షాక్ ఇస్తూ బిజెపి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబు ఐరన్ లెగ్ దెబ్బకు తెలంగాణలో ఇప్పటికే సమాధి అయిన టీడీపీ... ఏపీలో అవసాన దశకు చేరుకోగా ఆయన మిత్రులు కూడా ఈ ఎన్నికల దెబ్బతో బాబును నమ్మే పరిస్థితి కనపడడం లేదు.