వైఎస్ ఫ్యామిలీ పరువును గంగలో కలిపేస్తున్న షర్మిల.. జగన్ తప్పు లేదంటూ?

Reddy P Rajasekhar
ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదాలు సర్వసాధారణం అనే సంగతి తెలిసిందే. అయితే వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదాలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీ పరువును గంగలో కలిపేస్తూ షర్మిల వార్తల్లో నిలుస్తున్నారు. షర్మిల ఆస్తులకు సంబంధించిన వ్యవహారాన్ని రచ్చకీడ్చి జగన్ కు మంచే చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించి విబేధాలు ఉన్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా వైఎస్సార్ హయాంలోనే ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయని తెలిసి వైఎస్సార్ అభిమానులు షాకవుతున్నారు. జగన్ ను జైలుకు పంపించాలనే షర్మిల విజయమ్మ పేరిట ఉన్న షేర్లను కేసులు తేలకముందే తన పేరుపై బదిలీ చేయించుకున్నారనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
షర్మిల ఆస్తులకు సంబంధించి ఎన్ని లాజిక్స్ చెప్పినా వాస్తవాలు ఏంటో ప్రజలు తెలుసుకోలేని అమాయకులు కాదు. వైఎస్సార్ మరణించారు కాబట్టి జగన్ ను నిందించేలా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినంత మాత్రాన షర్మిల మాటలను ప్రతి ఒక్కరూ నమ్మే పరిస్థితులు లేవు. భవిష్యత్తులో జగన్ షర్మిల కలిసి పని చేసే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టేనని చెప్పవచ్చు.
 
షర్మిలకు అత్యాశతో జగన్ తో అనుబంధాన్ని తెంచుకుంటున్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. జగన్ కు కీడు చేయాలని భావించి షర్మిల మేలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పై నెమ్మదిగా అభిప్రాయం మారుతోంది. సంక్షేమ పథకాల అమలులో జగన్ కు జగనే సాటి అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ స్థాయిలో ప్రస్తుతం అయితే సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. పూర్తిస్థాయిలో ఇచ్చిన హామీల మేనిఫెస్టోను అమలు చేయడంలో కూటమి ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి. తల్లికి వందనం పథకం అమలు కూటమికి సులువు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: