బండి సంజయ్ లా మారుతున్న పవన్ కళ్యాణ్..ఊగిపోవడమేనా?

Veldandi Saikiran
రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అంశం పైన చర్చించుకుంటున్నారు. పొద్దున లేస్తే చాలు.. తిరుమల లడ్డు గురించే వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు తిరుమలలో శ్రీవారి లడ్డు కల్తీ అయిందని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది.
 
ఈ తరుణంలోనే వైసీపీ పార్టీ పైన తెలుగుదేశం తమ్ముళ్లు, కూటమిలో ఉన్న జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు రెచ్చిపోయి మాట్లాడుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వాడని... అందుకే లడ్డును కల్పి చేసి ఉంటాడని కూటమి పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ లడ్డు వివాదం లో.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు.
 
అచ్చం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్... వ్యవహరించినట్లుగానే.. హిందుత్వం గురించి పవన్ కళ్యాణ్ ఏపీలో వాదిస్తున్నారు. లడ్డు విషయంలో 11 రోజుల దీక్ష కూడా చేపట్టారు పవన్. దుర్గగుడి మెట్లు కూడా కడిగి ఫోటోలకు ఫోజులిచ్చారు. హిందూ ధర్మం గురించి ఎవరైనా.. చెడ్డగా మాట్లాడితే చీల్చి చెండాడుతానంటూ... ఓ బిజెపి కార్యకర్త లాగా వ్యవహరించారు  పవన్ కళ్యాణ్. టాలీవుడ్ హీరో కార్తీ అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్.
 
గతంలో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కూడా ఇలాగే వ్యవహరించేవారు. అభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా... కేవలం హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు బండి సంజయ్. ఏపీ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అదే ధోరణి తో  ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల కంటే ముందు ప్రకటించిన హామీల విషయంలో.. దృష్టి పెట్టకుండా... హిందుత్వ వాదాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నారని... కొంతమంది రాజకీయ విశ్లేషకులు సెటార్లు పేలుచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: