ఉత్తమ్‌, కోమ‌టిరెడ్డికి సైలెంట్‌గా చెక్ పెట్టేసిన రేవంత్‌... వాటే గేమ్ ..?

RAMAKRISHNA S.S.
గత కొద్దిరోజులుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ పేరును హై కమాండ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరు అని విస్తృత అభిప్రాయం సేకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ పేరు పార్టీ ప్ర‌క‌టించింది. ఈ క్రమంలోని పీసీసీ అధ్యక్షుడు ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా అధిష్టానం కోరింది. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ .. ఎస్టీలకు ఇవ్వాలని భావిస్తే ఎంపీ బలరాం నాయక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు.

అయితే ఉత్త‌మ్‌ కుమార్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వ‌ర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే మధు గౌడ్ గత మూడు ఎన్నికలలోను వరుసగా పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. 2014 - 2019 ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కి గౌడ్ గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ఇటు బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత కావటం ... అటు ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంట్లో చాలాసార్లు బలంగా గళ‌మెత్తిన నాయకుడు కావడంతో మధు గౌడ్ అంటే తెలంగాణ వర్గాలలో మంచి పేరు ఉంది.

అయితే సీనియర్ నటి మధు యాష్కీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన మొదట్లో సీనియర్ వర్సెస్ రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్రస్థాయిలను మాటల యుద్ధం కొనసాగింది. అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమన్వయం చేయటం ఆయనకు కలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రతిపాదించి ఉత్తమ్ - కోమటిరెడ్డి కి చెక్ పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: