అమెరికా అధ్యక్షుడు ట్రంపే.. ఖాయమైన గెలుపు?

Chakravarthi Kalyan
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భావోద్వేగంతో మాట్లాడారు.  మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సు చివరి రోజున మూడో సారి పార్టీ తరఫు అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరించిన ట్రంప్..ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. అమెరికా కాలమానం ప్రకారం..  గత శనివారం పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన మొదటి సారి మాట్లాడారు.

తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికా ప్రజలు తనపై కురిపిస్తున్న ప్రేమ, మద్ధతుకు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్.. ప్రజలకు పేవ చేయాలన్న తన సంకల్పం ఏ మాత్రం విచ్ఛిన్నం కాబోదన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అందించడానికి తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పిన ఆయన.. తన తీరుకు కాస్త భిన్నంగా ఎమోషనల్ గా మాట్లాడారు.

విశ్వాసం, బలం, ఆశతో కూడిన సందేశంతో అమెరికన్ల ముందు తాను నిలబడినట్లు ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉండేందుకు తాను భక్తితో గర్వంతో అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ప్రయాణంలో సతీమణి మెలానియా అండగా ఉందన్న ఆయన ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. తన ప్రాణం తీసేందుకు హంతకుడి బుల్లెట్ ఎంత దగ్గరగా వచ్చిందో అందరికీ తెలిసిందేనన్న ట్రంప్.. చాలా మంది ఆ రోజు ఏం జరిగిందని అడుగుతున్నారన్నారు.

ఈ సమయంలో ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నానని దీన్ని మ రోసారి నా నుంచి మీరు వినలేరు. ఎందుకంటే దాన్ని తలచుకోవడానికే భయంగా ఉంది. ఇంత హేయమైన దాడి జరిగినా గతం కంటే బలంగా.. నిశ్చయంగా మనమంతా ఇక్కడ  ఈ రోజు ఏమయ్యం.. మన సంకల్పం విచ్చిన్నం కాలేదు. ఉద్దేశం  మారలేదు. అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నా. నేను ఇవ్వాల్సినవన్నీ నా మనసుతో ఇస్తా. శక్తి మేర పోరాడతానని మాట ఇస్తున్నా అని వ్యాఖ్యానించారు.  బుల్లెట్ సరిగ్గా దగ్గరికి వచ్చిన రోజు తల తిప్పి ఉండకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. దేవుడు నా వైపు ఉన్నాడు అంటూ.. ఎమోషనల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: