' దివ్య భారతి ' కోసం చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత ఎవరు...?
పరుచూరి సోదరులు మాటలు అందించగా.. అసెంబ్లీ రౌడీ సినిమాకు మ్యూజిక్ దిగ్గజం కెవి మహదేవన్ సంగీతం అందించారు. తన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ అయిన సొంత నిర్మాణ సంస్థలో మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అసెంబ్లీ రౌడీ నిర్మించారు. ఇక చిత్తూరు జిల్లాలోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జరుపుకుంది. అలాగే శ్రీకాళహస్తీలో షూట్ చేసిన అందమైన వెన్నెలలోనా పాటకే మోహన్ బాబు చాలా ఖర్చు పెట్టారంటారు.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు నిర్మాతగా మోహన్ బాబుకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత మోహన్ బాబుకు కలెక్షన్ కింగ్ అన్న పేరు వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ దివ్య భారతి చాలా ప్లస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో కూడా తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా హిట్ అయ్యాక ఇదే మోహన్ బాబు - దివ్య భారతి కాంబినేషన్లో మరుసటి యేడాదే చిట్టెమ్మ మొగుడు సినిమా వచ్చింది.
ఈ సినిమా అందరూ ఒక్కటే కాకపోతే నిర్మాత మాత్రమే మారాడు. పి.శ్రీధర్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. అసెంబ్లీ రౌడీ సినిమా లో దివ్య భారతిని ఎంతగా ఆదరించారో చిట్టెమ్మ మొగుడులో మాత్రం దానికి భిన్నంగా వ్యతిరేకించారు. కేవలం దివ్య భారతితో సినిమా తీయాలన్న నిర్మాత శ్రీ థర్ రెడ్డి ఆత్రంతోనే ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ప్లాప్ కావడంతో నిర్మాతకు భారీ నష్టాలు మిగిలాయి.