పెద్దిరెడ్డికి చుక్కలు చూపించనున్న పవన్ కళ్యాణ్..??
గత ఐదేళ్లుగా పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి నిరంతరం స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. గత ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ పథకంలో స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించిందని, అయితే నేపాలీ పోలీసులు తమ రవాణాను అడ్డుకోవడంతో వారి తల రాత తారుమారైందని అన్నారు. నేపాల్ మీదుగా ఎర్రచందనం స్మగ్లింగ్కు ప్రయత్నించిన ఈ స్మగ్లింగ్కు సంబంధించిన ఫైల్ తనకు అందిందని, తదుపరి చర్యలను పరిశీలిస్తున్నానని పవన్ చెప్పారు.
గతంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించే బాధ్యత పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి వైసీపీ నేతలు ఇచ్చారు. కానీ డెస్టినీ వారిని వెక్కిరించింది. ఇప్పుడు స్వయంగా పవన్ చెప్పిన దాని ప్రకారం పెద్దిరెడ్డి స్మగ్లింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఫైల్ ఇప్పుడు తన డెస్క్పై ఉంది. అంటే పవన్ చేతిలోనే మిథున రెడ్డి భవిష్యత్తు పడింది. అతడిని ఓడించాలనుకున్నారు కానీ ఇప్పుడు అతని జాలి కోసం వేడుకోవచ్చు. మరి ఈ కేసును డిప్యూటీ సీఎం ఎలా పరిష్కరిస్తారో చూడాలి. పవన్ ఈ కేసును చక్కగా హ్యాండిల్ చేస్తే ఏపీలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయనపై నమ్మకం పెరిగి, సమర్థవంతమైన నాయకుడు అని గుర్తించి ఈసారి అతడినే సీఎం చేసే అవకాశం ఉంటుంది.
ఇకపోతే చంద్రబాబు నిన్న పింఛన్ లబ్ధిదారులందరికీ రూ.7,000 అందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా సిక్స్ గ్యారెంటీలలో అన్నిటినీ అమలు చేస్తామని అన్నారు. దాంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాగా సంతోషిస్తున్నారు తాము మంచి వ్యక్తికే ఓటు వేశామని హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు. ఒక వెయ్యి పెరగడం వల్ల వారికి ఐదేళ్లలో 72,000 ఎక్కువగా వస్తాయి. వీటిని అవసరమైన ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.