కర్మఫలం వైసీపీని విడిచిపెట్టడం లేదు?

Suma Kallamadi
అవును, కర్మఫలం వైసీపీని విడిచి పెట్టడం లేదు. వేధించి వెంబడిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. సామాన్య జనాలు నుండి డాక్టర్ సుధాకర్ మేటర్ వరకు అన్ని అరాచకాలే. దాని ఫలితంగా వచ్చిన రిజల్ట్స్ తాజా సార్వత్రిక ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఫలితం ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఎదుర్కొంటుంది. తీవ్రమైన చేదరింపుల నడుమ నేడు వైసీపీ మనుగడ కనుమరుగవుతోంది అనడంలో అతిశయోక్తి లేదు.
విషయం ఏమిటంటే పలువురు వైసిపి నేతలకు జనాల్లో ఎక్కడికి వెళ్లినా మద్దతు కొరవడుతోంది. గత నడవడిక కారణంగానే వారికి ఈ దుస్థితి కలిగిందని వేరే చెప్పనక్కర్లేదు. అవును, ఈ ప్రపంచానికి మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. గతంలో మాజీ మంత్రుల ముందు నిలబడి మాట్లాడడానికి భయపడిన జనం నేడు ధైర్యంతో తమ గొంతుక వినిపిస్తున్నారు. ఇకనైనా బుద్ధి మారి, మారు మనసు పొందితే మంచిదని, లేకుంటే పాతాళంలోకి పడిపోతారని హెచ్చరిస్తున్నారు సామాన్య జనం.
విషయం ఏమిటంటే ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలను ఉద్దేశించి, తాజా ఎన్నికల విషయం దుయ్యబడుతున్నారని, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే జనాలు ఆయనకు గట్టి కౌంటర్ ఇస్తున్నారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ గత అనుభవాల ద్వారా మనిషి అనే వాడు మారు మనసు పొందుతే బాగుపడతాడు... లేదంటే పుట్టగతులు లేకుండా పోతాడు అనేది చరిత్ర చెబుతోంది... కాదంటారా? ఇదే కదా మనకు చరిత్ర చెబుతోంది. ఎన్నో కుట్రలు పన్ని అధికారం చేజెక్కించుకున్న కౌరవుల పని ఆఖరికి ఏమైంది? ధర్మం చేతిలో ఓడిపోయారు. ఇప్పటికే అదే జరుగుతోంది.... ఎప్పటికీ అదే జరుగుతుంది! ఇది తెలుసుకొని మసులుకున్న నాడు మనిషి అనే వాడు బాగుపడతాడు... లేదంటే తీవ్రమైన పరిణామాలు చవిచూస్తాడు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: