81 ఏళ్ల వయసులోనూ అధికారులను వణికిస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో..??

Suma Kallamadi
నంద్యాల వరదరాజులరెడ్డి 1985 ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా ఐదుసార్లు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కీలు దాటిన తర్వాత కూడా ఆయన మళ్లీ అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 22 వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ టీడీపీ నేత గెలిచాక మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు. అధికారులను గడగడలాడిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన తప్పుల లెక్కలన్నీ తేల్చాల్సిందేనని, ఏదైనా తేడా వచ్చిందో చట్టపరమైన చర్యలు తప్పవు అని ఆయన అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాసేవను గాలికి వదిలేసి రాజకీయ నేతలకు సేవలు చేసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తనదైన రీతిలో ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గవర్నమెంట్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఆఫీసర్లను పేరుపేరునా పిలుస్తూ వారి తప్పులను ఎత్తిచూపుతూ కడిగిపారేసారట. దాంతో వైసీపీ రాజకీయ నేతలకు సేవలు చేసిన వారందరూ భయపడిపోతున్నారు. వీళ్లంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అలాగే ఇప్పటినుంచి ప్రజాసేవకే మొగ్గు చూపాల్సిందిగా ఆయన ఆదేశించారట. పద్ధతి మార్చుకోలేని వారు వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వెళ్ళిపోండి అంటూ కూడా ఆయన కరాకండిగా చెప్పేశారట.
 గత ఐదేళ్లలో ఏమేం చేశారు ఫైల్స్ రూపంలో తన ముందు ఉండాలని కూడా వరదరాజులరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే  రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి హయాంలో చాలా అక్రమాలు జరిగాయని, అవన్నీ ప్రభుత్వ అధికారుల సహాయంతోనే చోటుచేసుకున్నాయని వరదరాజులరెడ్డి కామెంట్లు చేస్తున్నారు. ఇకపై అలాంటివి జరగబోవు అని పారదర్శకంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కూడా ఈ నేత చెబుతున్నారు. చేసిన నిర్వాహకాలు చాలు అని ఇక వాటిని కంటిన్యూ చేస్తే తీవ్ర స్థాయిలో మాట్లాడారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ తో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: