రాయలసీమ: ఫైర్ బ్రాండ్ రోజా బీజేపీ పార్టీ ఎంట్రీపై దిమ్మతిరిగే ట్విస్ట్..!

Divya
వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ పార్టీ నిర్మించిన భవనాల విషయంలో గత కొద్ది రోజులు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా జగన్ కోసం కట్టించుకున్న ఇంద్రభవనాలు అంటు టిడిపి ప్రభుత్వం ఆరోపిస్తున్నది. వైసిపి మాత్రం ఇది పర్యాటక భవనాలు అంటూ పలువురు నేతలు కూడా ఇప్పటి అధికార పార్టీకి ధీమాగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే అంబాటి రాంబాబు, అమర్నాథ్ వంటి మాజీ మంత్రులు కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని ,రాష్ట్రపతి, గవర్నర్లు విశాఖకు వచ్చినప్పుడు వారికి విశ్రాంతి గదిగా వీటిని నియమించామని తెలిపారు.

తాజాగా మాజీ పర్యాటకశాఖ మంత్రి రోజా ఫైర్ బ్రాండ్ గా వైసీపీలో పేరు సంపాదించింది.పర్యటక స్థలంలో పర్యటక భావనాలు నిర్మించడం తప్ప అంటూ కొన్ని ప్రశ్నలతో కూడిన ప్రశ్నలను తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది. గత కొద్దిరోజులుగా రోజా బిజెపి పార్టీలో చేరుతుందని వార్తలు వినిపించాయి.. ఇప్పుడు ఆ వార్తలన్నిటికీ చెక్ పెట్టే విధంగా వైసిపి పార్టీ తరఫునుంచే తాను ఈ ప్రశ్నలు అడిగినట్టుగా కనిపిస్తోంది. విశాఖపట్నం నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో భవనాలను నిర్మించిందని.. వర్షపు నేటికే పడిపోయో అసెంబ్లీ సచివాలయాలని కట్టిన వారు ఇలాంటి నిజమైన భవనాలను చూసి తట్టుకోలేకపోతున్నారంటూ తెలిపింది.

రుషికొండలో అత్యంత నాణ్యమైన భవనాలను నిర్మించడం చూడండి కేంద్ర పర్యటన అటవీశాఖ పూర్తి వివరాలు 2021లో రుషికొండ నిర్మాణం చేపట్టింది అంటూ తెలిపింది. మొత్తం మీద 61 ఎకరాలలో 9.88 ఎకరాలలో ఈ నిర్మాణం చేపట్టామంటూ తెలిపింది. ఇందులో అక్రమం ఎక్కడ ఉంది అంటూ ఆమె ప్రశ్నించింది. విశాఖపట్నంలో భవనాలు నిర్మించడం నేరమా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులను ఆకర్షించేందుకే ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడం తప్ప అంటూ తెలిపింది. అందుకు సంబంధించిన పూర్తి టెండర్ పత్రాలను కూడా పొందుపరిచామంటూ తెలిపింది రోజా. ప్రస్తుతం రోజా చేసిన ట్విట్ వైరల్ గా మారుతున్నది. ఇంకా మరెన్నో ప్రశ్నలను కూడా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: