వైసీపీకి దిక్కు షర్మిలనేనా..2029దే టార్గెట్టా.?

Pandrala Sravanthi
 ఆంధ్ర ప్రదేశ్   రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాభవాన్ని పొందింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.  కానీ జగన్ ఓటమికి మరో ముఖ్యమైన కారకురాలు తన చెల్లెలు షర్మిల అని కూడా చెప్పవచ్చు. తన సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల మరియు సునీత సొంత అన్నపై విల్లు ఎక్కుపెట్టి బాణం విడిచారు.  ఆ బాణం దెబ్బకు జగన్ విపరీతంగా గాయపడ్డారని చెప్పవచ్చు. ఈ విధంగా షర్మిల తన అనుకున్నటువంటి మొదటి లక్ష్యాన్ని  నెరవేర్చుకుంది. అయినా ఆమె పగ చల్లారినట్టు లేదు.

  ఎలాగైనా వైసీపీని పూర్తిగా లేకుండా చేసి ఏపీలో నెక్స్ట్ కాంగ్రెస్ జెండా ఎగరేలా చేయాలనేది ఆమె ప్రథమకర్తవ్యమట. అంతేకాకుండా ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం కూడా విపరీతమైనటువంటి సపోర్ట్ ఇస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండే క్యాడర్ అంతా ఒకప్పటి కాంగ్రెస్ క్యాడరే.  రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన అభిమానులు ఇతర నాయకులంతా తన కొడుకువైపు తిరిగారు. దీంతో అక్కడ కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది.  ఇదే తరుణంలో మంచి ప్లాన్ వేసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం, 2029 ఎన్నికల వరకు ఎలాగైనా కాంగ్రెస్ కు పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఆశపడుతోంది.  దీనికోసం వైయస్ షర్మిలను  రంగంలోకి దింపింది.

 వాళ్లు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. ఇక రెండవ ప్లాన్ కూడా సోనియా, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధిష్టానం అంతా కలిసి చేస్తున్నారట.  ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ గట్టిగా ఎదగాలని ఆమెకు ఎలాంటి సపోర్ట్ అయిన ఇవ్వడానికి సిద్ధం అయిపోయారట. దీంతో షర్మిల కూడా 2029 టార్గెట్ గా పెట్టుకుని వైసీపీని పూర్తిగా పాడుచేసి ఆ కేడర్ అంతా కాంగ్రెస్ వైపు మల్లెల చేసే ప్రయత్నానికి అడుగులు వేస్తోందని తెలుస్తోంది. మరి చూడాలి ఈ ప్రయత్నాలను అన్న జగన్ ఎలా తిప్పి కొడతారు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: