ఏపీలో మళ్ళీ ఎన్నికలు.. షెడ్యూల్ వచ్చేసింది ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ హడావిడి ముగియకముందే... ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూలు ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం.

ఈ నెల 25 వ తేదీన ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్లు... వెల్లడించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియ... వాటి దాఖలుకు... జూలై రెండవ తేదీ  తుది గడువు విధించింది ఎన్నికల సంఘం. అలాగే జూలై నెల 5వ తేదీ వరకు... గడువు కూడా ఫిక్స్ చేసింది. జులై 12 వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అదే రోజు... సాయంత్రం నాలుగు గంటల వరకు.. ఫలితాలు కూడా వెల్లడి కానున్నట్లు ప్రకటించింది.

ఇటీవల... సి. రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్   వైసిపి పార్టీని వీడటంతో... వారిపై వేటు వేసింది అధిష్టానం. ఈ తరుణంలోనే... రామ చంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు కూడా వేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం కూటమి... ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్లు... రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.... వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. 151 ఎమ్మెల్యేలు ఉన్న  వైసిపి పార్టీ 11 స్థానాలకి పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి మినహా మిగతా పెద్ద లీడర్లు ఎవరు కూడా నిలవలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: