మంత్రి లోకేష్ : విశాఖ అలా... తిరుపతి ఇలా..?

FARMANULLA SHAIK
ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం తర్వాత టీడీపీ యువ నాయకుడు,మాజీ మంత్రి ఐనా లోకేష్ కు విద్యాశాఖ, ఐటీ శాఖలకు మంత్రి గా నియమించడం జరిగింది.ఏపీలో ఒక విధంగా చెప్పాలంటే విశాఖ పెద్ద నగరం. అభివృద్ధి చెందిన నగరం. ఇంకా చేయడానికి అవకాశం ఉన్న నగరం. అందుకే రాజధాని గా అమరావతిని అభివృద్ధి చేసి.. అదే సమయం లో విశాఖను మరింత అభివృద్ధి చేసి.. దేశంలోనే పేరు మోసిన నగరాల జాబితాలో చేర్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి గా నారా లోకేష్ ఉంటూ విశాఖ లో పాలన జరిగే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాల తో పాటు పార్టీ పరమైన విషయా ల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరోవైపు లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటి హబ్ గా మార్చేందుకు లోకేష్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా విశాఖను ఐటీ హబ్ గా అలాగే తిరుపతి ని ఎలక్ట్రానిక్స్ హబ్ గా చేయాలన్నది లోకేష్ ప్లాన్ అంట. దాంట్లో భాగంగానే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా త్వరలో నూతన ఐటీ పాలసీని విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. శనివారం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖలపై మంత్రి ఉండవల్లి లోని నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలను రప్పించడానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఉన్న కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిల వివరాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఈ రంగాల్లో పేరుగాంచిన కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని అధికారులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: