మంత్రి లోకేష్ : విశాఖ అలా... తిరుపతి ఇలా..?
ముఖ్యంగా విశాఖను ఐటీ హబ్ గా అలాగే తిరుపతి ని ఎలక్ట్రానిక్స్ హబ్ గా చేయాలన్నది లోకేష్ ప్లాన్ అంట. దాంట్లో భాగంగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా త్వరలో నూతన ఐటీ పాలసీని విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. శనివారం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలపై మంత్రి ఉండవల్లి లోని నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఉన్న కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిల వివరాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్నారు. విశాఖను ఐటీ హబ్గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఈ రంగాల్లో పేరుగాంచిన కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని అధికారులను కోరారు.