అవ్వాతాతలకు కొడుకులా అండగా చంద్రన్న.. ఈ స్థాయిలో ఎవరూ పెంచలేదుగా!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జులై 1 నుంచి రాష్ట్రంలో పెంచిన పింఛన్లు పంపిణీ జరిగేలా తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఎరియర్స్ తో కలిపి రాష్ట్రంలోని అవ్వాతాతలు జులై 1వ తేదీన 7000 రూపాయల పింఛన్ అందుకోనున్నారు. ఆగష్టు నెల 1 నుంచి ప్రతి నెలా 4000 రూపాయల చొప్పున వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయనున్నారు. అవ్వాతాతలకు కొడుకులా అండగా చంద్రబాబు నిలబడ్డారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
గతంలో 200 రూపాయల పింఛన్ ను 1000 రూపాయలకు పెంచిన చంద్రబాబు తర్వాత రోజుల్లో ఆ మొత్తాన్ని 2000 రూపాయలకు పెంచారు. జగన్ పింఛన్ పెంచినా విడతల వారీగా పెంచడం విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇకపై ప్రతి నెలా దాదాపుగా 4,000 రూపాయల పింఛన్ అందనున్న నేపథ్యంలో అవ్వాతాతల కళ్లు ఆనందంతో మెరిసిపోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
పింఛన్ల పెంపు విషయంలో చంద్రబాబును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలను కీలక హామీలను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు దివ్యాంగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, మంచానికి పరిమితమైన వాళ్లకు సైతం పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచేశారు.
 
వృద్ధుల విషయంలో ఇంత జాలి, దయ, కరుణతో వ్యవహరించడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పథకాలను అమలు చేసి ప్రశంసలు పొందడంతో పాటు ప్రజలు మెచ్చేలా అద్భుతమైన పాలన అందిస్తారేమో చూడాల్సి ఉంది. బాబు నిర్ణయాలకు నెటిజన్లు మాత్రం ఎంతో ప్రశంసిస్తున్నారు. మరోవైపు రాజీనామా చేసిన వాలంటీర్లను సైతం తిరిగి విధుల్లోకి తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లకు పెంచిన వేతనం ఎప్పటినుంచి అమలవుతుందో తెలియాల్సి ఉంది. కార్యకర్తలకు సైతం తెలుగుదేశం పార్టీ తగిన విలువ ఇస్తుండటంతో వాళ్లు ఎంతో సంతోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: