వామ్మో: కాసుల వర్షం కురిపిస్తున్న బాబు హెరిటేజ్ ఫుడ్స్..!

Divya
నారా చంద్రబాబునాయుడు కుటుంబం ప్రమోట్ చేస్తున్నటువంటి హెరిటేజ్ ఫుడ్స్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాసుల వర్షం కురిపిస్తుందని తెలుస్తోంది. కేవలం ఆరు రోజులలోనే 70% పైగా పెరిగి రిటైల్ ఇన్వెస్టర్లను ఖుషి చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రోజున ట్రెండింగ్ ప్రారంభమైన సమయానికి 20 నిమిషాలలో ఈ స్టాక్ 727 వరకు చేరింది.. కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 6,450 కోట్లకు సైతం పెరిగిందని తెలుస్తోంది. ఏ కంపెనీలో వాటా ఉన్నటువంటి టిడిపి అధినేత చంద్రబాబు తన మనవడు దేవాన్సు సంపాదన కేవలం 6 రోజులలోపే కోటి 70 లక్షల రూపాయల వరకు పెరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ వాట విషయానికి వస్తే..0.06 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది.1992 లో ప్రారంభమైన ఈ హెరిటేజ్ ఫుడ్ లో చంద్రబాబు కుటుంబం మొత్తం మీద 35.7% వాటా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఈ కంపెనీలో 24.37 % వాటా అలాగే నారా లోకేష్ కు 10.82% వరకు వాటా ఉన్నదట అలాగే నారా బ్రాహ్మణికి సైతం..0.46% వాటా ఉన్నది. దీంతో గత ఆరు రోజులలోనే చంద్రబాబు కుటుంబానికి మొత్తం చూసుకుంటే సుమారుగా 1100 కోట్లకు పైగా సంపాదన పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు పగ్గాలు  చేపట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో అనుప్యంగా మార్కులు వచ్చాయి. ముఖ్యంగా టాప్ మార్కెట్లో కూడా భారీ రిటర్న్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మే 31న రూ.404 రూపాయలో ఉన్నటువంటి ఈస్టర్ ఈ రోజున 695 రూపాయలు సైతం పెరిగిపోయింది.. దీంతో వారం రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్ స్టార్ట్ 70% వరకు పైకి ఎగబాకింది. 2019లో టిడిపి పార్టీ అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా హెరిటేజ్ సంస్థ డవున్ అయిపోయింది.. గత ఏడాది ఆగస్టులో కంపెనీ డివైడింగ్ను కూడా ప్రకటించింది దాదాపుగా 138 కనిష్టానికి పడిపోయిందని తెలిపింది. ఆంధ్రాలో టిడిపి అధికారంలోకి వస్తుందని అంచనాలు రావడంతో ఒక్కసారిగా 229 % పెరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: