షర్మిల: చేసిందంతా చేసి.. ఇప్పుడు వేలెత్తి చూపుతోందా..?

Divya
ఇటీవలె ఎన్నికలలో వైసిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది.. కూటమి 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది.. 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి కావడానికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు చాలామంది కూడా సపోర్టు చేశారు. అయితే 2024లో జగన్ ని ఓడించడానికి తన కుటుంబంతో పాటు ఇతర నేతలు కూడా చాలా కుట్రలు పడి మరి ఓడించారు. ముఖ్యంగా జగన్ చెల్లెలైన షర్మిలా కూడా కాంగ్రెస్ పార్టీ తగ్గాలని చేపట్టి మరి జగన్ పైన విరుచుకుపడింది.

అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వంటి నాయకులకు సపోర్ట్ చేసినట్టుగా కనిపించింది. అయితే ఎట్టకేలకు జగన్ ఓడించి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేలా చేశారు. అయితే ఇంకా అధికారికంగా పగ్గాలు చేపట్టగానే అటు టిడిపి జనసేన నాయకుల సైతం తీవ్రస్థాయిలో దాడులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైయస్ విగ్రహాలను సైతం ఎక్కడపడితే అక్కడ కూల్చేస్తూ పలు రకాల విగ్రహాలను కూడా కుల్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన షర్మిల స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేసింది షర్మిల.

రాష్ట్రంలో మహానేత వైయస్సార్ విగ్రహాల పైన అల్లరి ముఖాలు చేస్తున్న ఈ వికృత దాడులను సైతం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం చాలా దారుణమని.. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు తెలుగు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు.. చాలామంది తెలుగు ప్రజల హృదయాలలో ఆయన చెరపలేని ఒక జ్ఞాపకం గా మారారు ఇటువంటి  నేత మీద ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం సరికాదు గెలుపోటములు అనేది సహజము వైయస్సార్ ని అవమానించేలా ఉన్న ఇలాంటి చర్యలకు బాధ్యతలు అయిన వారందరినీ కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలుపుతోంది.

వైయస్ పేరు వింటేనే టిడిపికి కోపం వస్తుంది.. అలాంటిది గతంలో టిడిపి పార్టీకి జనసేన పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా కనిపించింది.. ఇప్పుడు మళ్లీ వాళ్ళు చేస్తున్న వాటిపైన లబోదిబోమంటే ఏం లాభం అంటే చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీంతో పలువురు నేతలు కార్యకర్తలు కూడా చేసిందంతా చేసి ఇప్పుడు వేలెత్తి చూపుతున్నావా అంటు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YSR

సంబంధిత వార్తలు: