తిరుపతి: వెంకన్న సాక్షిగా గెలిచింది టిడిపినే.. ఎంత మెజారిటీ అంటే..?
అయితే ఇక్కడ వైసీపీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినయ్ రెడ్డి తిరుపతి రాజకీయాలలో వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉండగా.. కూటమి మాత్రం అనూహ్యంగా ఇక్కడ టిడిపి అభ్యర్థిని మార్చేసి జనసేన వ్యక్తిని రంగంలోకి దించారు. జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు రంగంలోకి దిగారు. ఇకపోతే అభినయ్ విషయానికి వస్తే.. తిరుపతి అభివృద్ధిలో కీలకంగా మారారు.. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం యజ్ఞంలో చేపట్టిన అభినయ్ తిరుపతి నగర అభివృద్ధిలో జనంలో మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.. ఆరు నెలల క్రితమే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూకుడు పెంచిన అభినయ్ తిరుపతి పాలిటిక్స్ లో కీలకమయ్యారు..
ఇక అందుకే ఎలాగైనా సరే ఈసారి అభినయ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పంపాలని వైసీపీ ప్రభుత్వం తీర్మానించింది.. మరొకవైపు జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కూటమి తరపున బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే అభినయ్ దూకుడు యువతకు ఆదర్శంగా ఉంటుందని.. ఓట్లన్నీ ఆయన వైపే వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇద్దరిలో ఎవరు గెలిచారు అని తాజా కౌంటింగ్ ఫలితాల ప్రకారం చూస్తే.. ఆరినేని శ్రీనివాసులు రావు.. భూమన అభినయపైన 61,956 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.