పెనమలూరు : నాన్ లోకల్ జోగిని జోకొట్టి ఇంటికి పంపేశారు.. బోడే ప్రసాద్ కం బ్యాక్ బ్లాక్బస్టర్ విక్టరీ
వైసీపీ నుంచి గత ఎన్నికలలో గెలిచిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ కండువా కప్పుకుని నూజివీడు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగన్.. పెడన ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ ను అనూహ్యంగా పెనమలూరు కి బదిలీ చేసి.. ఇక్కడ పోటీ చేయించారు. వాస్తవంగా చూస్తే పెనమలూరు తెలుగుదేశం పార్టీకి... కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉంది. తాజా ఎన్నికలలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధిని కాదని గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సీటు ఇవ్వటం జగన్ చేసిన బిగ్ మిస్టేక్ అని వైసిపి వాళ్ళే భావించారు.
ఎన్నికల ప్రచారం.. పోలింగ్ తర్వాత కూడా.. ఇక్కడ కచ్చితంగా బోడే ప్రసాద్ విజయం సాధిస్తారని అంచనాలే ఎక్కువగా వినిపించాయి. పైగా నియోజకవర్గానికి బోడే ప్రసాద్ లోకల్. కాగా జోగి రమేష్ నాన్ లోకల్. కృష్ణాజిల్లాలో మైలవరం, పెడన, పెనమలూరు ఇలా మూడు నియోజకవర్గాలు మారి మారి జోగి రమేష్ ఇక్కడికి రావడం కూడా వైసీపీ వాళ్ళు పెద్దగా సహకరించలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇక ఫైనల్గా పెనమలూరు బాస్గా బోడే ప్రసాద్ అదిరిపోయే విక్టరీ కొట్టారు. మొత్తం 22 రౌండ్లలో 17 రౌండ్లకే 50 వేల + మెజార్టీ దాటేసి దూసుకు పోతున్నారు. నిజంగా సీటు లేనప్పుడు పోరాటం చేసి ఎమోషనల్ గా మెప్పించి సీటు దక్కించుకున్న బోడే ఈ రోజు అదిరిపోయే విజయం తన ఖాతాలో వేసుకున్నారు.