పిఠాపురం : వామ్మో ఏం గెలుపు పవనూ.. ఏం మెజార్టీ... జగన్కు ఈ రోజు ఓ కాళరాత్రి..!
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత సంచలన విజయం సాధించారు. నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ తో పాటు.. గొల్లప్రోలు నగర పంచాయతీ - పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు విస్తరించి ఉన్నాయి. కాపులతో పాటు.. మత్స్యకార, శెట్టి బలిజ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడం బిగ్గెస్ట్ ఎస్సెట్.
ఇటు టీడీపీతో పొత్తు నియోజకవర్గంలో బలమైన అనుచరుగడం వల్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం.. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు.. పవన్ గత రెండు ఎన్నికల్లో ఓడిపోయాడు అన్న సానుభూతి ఈసారి బలంగా పనిచేసాయి. నామినేషన్ల పర్వం ప్రచారం, పోలింగ్ సర్వే చూస్తే.. పవన్ గెలుపు పై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. అయితే పవన్ మెజార్టీ ఎంత వస్తుంది అన్న చర్చే ముందు నుంచి నడిచింది.
ఈ రోజు జరిగిన కౌంటింగ్లో పవన్ కళ్యాణ్ ఏకంగా 70 వేల ఓట్ల భారీ మెజార్టీతో వంగా గీతను ఓడించి సగర్వంగా మెగా, జనసేన అభిమానులు తలెత్తుకునేలా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాడు. పవన్కు వచ్చిన మెజార్టీ చూసి జగన్కు నిజంగానే ఓ కాళరాత్రి అని చెప్పాలి. ఇక మరి పవన్కు బాబు డిప్యూటీ సీఎంతో పాటు ఏ మంత్రి పదవి ఇస్తారనేదే చూడాలి.