ఎన్నికల కౌంటింగ్ : ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఇలా జరుగుతుందా..?

FARMANULLA SHAIK
ఏపీలో మరికొద్ది నిమిషాల్లో కౌంటింగ్‌ ప్రక్రియకు ప్రారంభం కానుంది.అసలు ఈ కౌంటింగ్‌ ప్రక్రియ విషయానికి వస్తే మొదట పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్స్‌లో జాగ్రత్త చేస్తారు.అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా అక్కడే నిర్వహిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా 14 టేబుల్స్‌ ఉంచి వాటిపై ఒక్కో ఈవీఎం ఉంచుతారు. అలా 14 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్ని ఫస్ట్ రౌండ్‌ రిజల్ట్‌ అంటారు. ఓట్ల లెక్కింపుకు ముందు ఈవీఎంలను ఓపెన్‌ చేస్తారు. ఈవీఎం యంత్రంలోని రిజల్ట్‌ విభాగానికి ఒక సీల్‌ వేసి ఉంటుంది.  దాన్ని ఏజెంట్ల సమక్షంలో మాత్రమే ఓపెన్ చేయాలి. ఈవీఎం పైన ఉన్న కప్పును మాత్రమే ఓపెన్‌ చేస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా ఈవీఎం పవర్‌ ఆన్ చేస్తారు. దానికి లోపల మరో సీల్‌ ఉంటుంది. దాన్ని తొలగిస్తే రిజల్ట్స్ బటన్‌ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఈ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.

అయితే మాములుగా కౌంటింగ్‌లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటికోసం కౌంటింగ్‌ కేంద్రంలో ప్రత్యేక టేబుల్‌ ఏర్పాటు చేస్తారు. పోస్టల్‌ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాన్ని ప్రకటించేవరకు బాధ్యత మొత్తం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పైనే ఉంటుంది. ఇక ఈవీఎంలను ఓపెన్‌ చేస్తున్నప్పుడు, దాని సీల్‌ సరిగా ఉందా లేదా అనేది అన్ని పార్టీల ఏజెంట్లకు చూపిస్తారు. అది సరిగా ఉందని వాళ్లు నిర్ధారించుకున్న తర్వాతే ఈవీఎంలను ఓపెన్‌ చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు.  ఇక కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలు మొరాయించినట్లయితే, వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌లోని స్లిప్పులు లెక్క పెట్టాంటే దాదాపు గంట సమయం పడుతుంది.పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ లేనిచోట ఉదయం 8 గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలౌతుందని ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనాస్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్‌ సెంటర్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: