ఏపీ: టీడీపీలో పెరుగుతున్న టెన్షన్..??

Suma Kallamadi
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నేటికి పది రోజులు పూర్తయింది. రేపు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో అధికారికంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. దాంతో సీఎం ఎవరనేది తేలిపోనుంది. ఈ సమయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చాలా టెన్షన్ పడుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల కారణంగా తాను గెలుస్తామనే ఒక ధీమాలో అయితే ఉన్నారు కానీ టీడీపీలో మాత్రం సర్వత్రా టెన్షన్ కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు ప్లస్ అవుతుందని టీడీపీ బలంగా నమ్ముతోంది.
 2019లో ముప్పై సీట్లు ఇప్పుడు ఆ టిడిపి గెలుచుకోలేకపోయింది అప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది అనుకున్నారు ఆ తర్వాత జగన్ దూకుడుకు చంద్రబాబు రాజకీయాల్లో లేకుండా పోతారని అందరూ అనుకున్నారు కానీ ఆ క్రమంలో జనసేన టిడిపిలో కలవడం బీజేపీ కూడా పొత్తు కుదుర్చుకోవడం జరిగింది దానివల్ల ఈ టీడీపీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. ఇప్పుడు చాలామంది టీడీపీ 120 నుంచి 130 వరకు సీట్లు గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్లు చేస్తున్నారు. 18 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఆ రేంజ్ లో ఈ పార్టీ బలంగా స్థాయికి రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు.
కానీ టీడీపీ అనుమానాల కారణంగా బాగా టెన్షన్ పడుతోంది. మనకి ఏ సెక్షన్ వారు ఓట్లు వేశారు? పేదలు మన వైపే ఉన్నారా? సంక్షేమ పథకాలు పొందిన వారు ఎక్కువ సంక్షేమ పథకాల కోసం తమకు ఓట్లు వేశారా? చదువుకున్న వాళ్ళు ఎటు ఓట్లు వేశారు? ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఎవరికిపడి ఉంటాయి? ఏ సెక్షన్ వాళ్ళు తమకు ఓట్లు వేశారు అని ఇలా రకరకాల ప్రశ్నలు వారికి వారే సంధించుకుంటున్నారట. వృద్ధులు ఎక్కువ టెన్షన్ కోసం తమకే ఓట్లు వేసి ఉంటారని చంద్రబాబు అనుకుంటున్నారు. అనుకున్నంత మాత్రాన ఆ ఓట్లు పడిపోయి ఉండవు కదా. అందుకే వారిలో చాలా భయం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: